ఛత్తీస్ఘడ్లో ఎన్కౌంటర్...నలుగురు మావోయిస్టులు హతం
ABN , First Publish Date - 2020-08-12T18:02:18+05:30 IST
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు....

రాయపూర్ (ఛత్తీస్ఘడ్): ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. సాయుధ పోలీసులు బుధవారం ఉదయం 9.30 గంటలకు మావోయిస్టుల కోసం జాగర్ గుండా అడవుల్లో గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాల వద్ద 303 రైఫిల్, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రి పోలీసులకు లభించాయి. ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.