యూపీలో భారీవర్షాలు, పిడుగుల వల్ల 43 మంది మృతి
ABN , First Publish Date - 2020-06-01T14:19:23+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 43 మంది మరణించారు....
లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 43 మంది మరణించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం కురిసిన భారీవర్షాలు, పిడుగుల పాటుకు ఉన్నవ్ లో 8 మంది, కన్నౌజ్ లో ఐదుగురు మరణించారు. లక్నో నగరంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బహువా ప్రాంతంలో సంభవించిన గాలులతో ఓ ఇల్లు కూలి 55 ఏళ్ల వృద్ధుడు మరణించారు. కుసుంబీ గ్రామంలో ఉద్ధృత గాలుల వల్ల ఇల్లు కూలి మరో వృద్ధుడు మృత్యువాత పడ్డారు.