కర్ణాటక: బస్సులో మంటలు, ఐదుగురు మృతి
ABN , First Publish Date - 2020-08-12T14:44:26+05:30 IST
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
బెంగళూరు: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనంకాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.