పంజాబ్ పాఠశాల వ్యాన్లో మంటలు..
ABN , First Publish Date - 2020-02-16T07:29:22+05:30 IST
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో శనివారం నలుగురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారు విగతజీవులుగా మారారు. దుర్ఘటన
![పంజాబ్ పాఠశాల వ్యాన్లో మంటలు..](https://media.andhrajyothy.com/appimg/galleries/202002160158106/02162020015916n46.jpg)
నలుగురు విద్యార్థుల సజీవ దహనం
చండీగఢ్, ఫిబ్రవరి 15: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో శనివారం నలుగురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారు విగతజీవులుగా మారారు. దుర్ఘటన సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులుండగా.. 8 మందిని స్థానికులు రక్షించారు. వీరంతా 10-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలు. వ్యాన్ డ్రైవర్ తలుపులు తెరిచి విద్యార్థులను రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.