ఇద్దరు కరోనా పాజిటివ్ రోగులపై పోలీసు కేసు
ABN , First Publish Date - 2020-04-01T15:08:24+05:30 IST
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులపై అండమాన్ నికోబార్ పోలీసు దక్షిణ డిప్యూటీ కమిషనర్ కేసు నమోదు చేశారు....

అండమాన్ నికోబార్ : కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులపై అండమాన్ నికోబార్ పోలీసు దక్షిణ డిప్యూటీ కమిషనర్ కేసు నమోదు చేశారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పది మంది ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశంలో పాల్గొని తిరిగి అండమాన్ కు వచ్చారు. వారిని పరీక్షించగా వారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని తేలింది. కరోనా వైరస్ సోకిన ఇద్దరు రోగులు ఎవరెవరిని కలిశారనేది సరైన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారు. హోంక్వారంటైన్లో ఉండాలని కోరినా వారు నిబంధనలను ఉల్లంఘించి తిరిగారు. దీంతో పోలీసులు కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులను ఆసుపత్రికి తరలించి, వారిపై కేసు నమోదు చేశారు.