ఆప్ మార్ఫింగ్ వీడియోపై బీజేపీ కేసు

ABN , First Publish Date - 2020-02-08T17:23:12+05:30 IST

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో బీజేపీ కీలకనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ గా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోను రూపొందించిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ బృందంపై బీజేపీ నేతలు కేసు పెట్టారు.

ఆప్ మార్ఫింగ్ వీడియోపై బీజేపీ కేసు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో బీజేపీ కీలకనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ గా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోను రూపొందించిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ బృందంపై బీజేపీ నేతలు కేసు పెట్టారు. మార్ఫింగ్ వీడియోలో బీజేపీతోపాటు అమిత్ షా ప్రతిష్ఠను దెబ్బతీసేలా మార్ఫింగ్ వీడియో తీశారని బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మార్ఫింగ్ వీడియో తీసిన ఆప్ నేతలపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పారు. ఈ వీడియోలో విజయ్ గోయల్, గౌతం గంభీర్, మనోజ్ తివారీలను దోపిడీ దొంగలుగా చిత్రీకరించారు. దీనిపై తాము ఆప్ నేతలపై ఐఫీసీ సెక్షన్ 465, 469, 471, 504, 505(1) బి కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-02-08T17:23:12+05:30 IST