పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలతో భేటీ కానున్న నిర్మలా సీతారామన్
ABN , First Publish Date - 2020-12-13T20:52:58+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వివిధ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో సమాలోచన సమావేశాన్ని నిర్వహించున్నారు

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వివిధ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో సమాలోచన సమావేశాన్ని నిర్వహించున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంప్రదింపులను నిర్వహించనున్నారు. అయితే ఈ ‘‘ప్రీ బడ్జెట్’’ సంప్రదింపులు వర్చువల్ గా మాత్రమే జరుగుతాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాల నేతలు, సామజికవేత్తలు ఇలా.... పౌర సమాజంలో ఉన్న ప్రముఖులతో ఆర్థిక శాఖ ఓ భేటీ నిర్వహిస్తుంది.