జ్వరం ఉంటే ఆ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం..!

ABN , First Publish Date - 2020-03-16T14:32:13+05:30 IST

ఆలయానికి వచ్చే భక్తులకు 99 డిగ్రీల జ్వరం ఉంటే ప్రవేశానికి అనుమతించమని తిరుచ్చి శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ జయరామన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ‘కోరస్‌’ వైరస్‌ నిరోధక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం

జ్వరం ఉంటే ఆ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం..!

చెన్నై : ఆలయానికి వచ్చే భక్తులకు 99 డిగ్రీల జ్వరం ఉంటే ప్రవేశానికి అనుమతించమని తిరుచ్చి శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ జయరామన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ‘కోరస్‌’ వైరస్‌ నిరోధక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో ముందస్తు క్రిమిసంహాకర మందుల పిచికారీతో పాటు ఆలయాలకు వచ్చే భక్తులను పరీక్షిస్తు న్నారు. ఈ నేపథ్యంలో, ప్రసిద్ధిచెందిన శ్రీరంగం రంగనాథర్‌స్వామి ఆలయ అధికా రులు, ఆరోగ్యశాఖ సిబ్బంది సంయుక్తంగా ఆలయానికి వచ్చే భక్తులకు థర్మల్‌ స్కానర్‌ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విష యమై ఆలయ జాయింట్‌ కమిషనర్‌ జయ కుమార్‌ మాట్లాడుతూ,  వైద్య సిబ్బందితో పాటు ఆలయ సిబ్బంది భక్తులను ధర్మల్‌ స్కేనర్‌ ద్వారా పరీక్షిస్తున్నామన్నారు. 99 డిగ్రీ జ్వరంతో ఉండే భక్తులకు ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నామన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు చేతులను శుభ్రపరచు కొనే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు ఆల యానికి రావొద్దని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-16T14:32:13+05:30 IST