మందుకొట్టి స్కూలుకెళ్లిన మహిళా టీచర్.. నిజం బయటపడటంతో..

ABN , First Publish Date - 2020-02-05T22:27:22+05:30 IST

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పింది. ఫుల్లుగా మందుకొట్టి బడికి వచ్చి, పాఠాలు చెప్పింది.

మందుకొట్టి స్కూలుకెళ్లిన మహిళా టీచర్.. నిజం బయటపడటంతో..

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పింది. ఫుల్లుగా మందుకొట్టి బడికి వచ్చి, పాఠాలు చెప్పింది. ఈ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని స్కూల్లో ఓ 38ఏళ్ల మహిళ టీచరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో జనవరి 31న స్కూలుకు వెళ్లిన ఆమె తప్పతాగి తూలుతూ విద్యార్థుల కంటబడింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఘటనపై విచారణకు సూరత్ మున్సిపల్ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్‌ఎంఈబీ) ఆదేశించినట్లు సమాచారం. మంగళవారం జరిగిన ఎస్‌ఎంఈబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా వుండగా ఘటన జరిగినప్పటి నుంచి సదరు ఉపాధ్యాయురాలు స్కూల్‌కు వెళ్లడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్కూలు వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-02-05T22:27:22+05:30 IST