రైతుల రణం.. కేంద్రం అంతర్మథనం
ABN , First Publish Date - 2020-12-01T07:26:36+05:30 IST
ఐదురోజులు గడిచాయి. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది రైతుల నిరసన ఆగలేదు. కొత్త వ్యవసాయ చట్ల్టాలను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావనికి చెందిన రైతులు.. ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ, తమ డిమాండ్లకు అంగీకరించేంత వరకూ ఆందోళన విరమించబోయేదే...
- నిర్ణయాత్మక పోరు ఇది.. వ్యవసాయ చట్టాలు రద్దుచేయాల్సిందే: రైతులు
- ఢిల్లీ సరిహద్దుల్లోనే వేలమంది బైఠాయింపు
- జైలును తలపిస్తున్న నిరంకారి మైదానం
- కీలక మంత్రుల మంతనాలు
- ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు: ప్రధాని
- నిరసనల వెనుక ఖలిస్థానీలు: బీజేపీ
- ఎన్డీయే నుంచి వైదొలగుతాం: ఆర్ఎల్పీ
న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఐదురోజులు గడిచాయి. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది రైతుల నిరసన ఆగలేదు. కొత్త వ్యవసాయ చట్ల్టాలను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావనికి చెందిన రైతులు.. ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ, తమ డిమాండ్లకు అంగీకరించేంత వరకూ ఆందోళన విరమించబోయేదే లేదని తేల్చిచెప్పారు. ఈసారి నిర్ణయాత్మక పోరుకు సిద్ధమయ్యే రాజధానికొచ్చామని ప్రకటించారు. డిమాండ్లపై చర్చకు తావులేదని తాజాగా భీష్మించిన అన్నదాతలు- ఒకవేళ వీటికి గనక ఒప్పుకోకుంటే కేంద్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోమవారంనాడు జరిగిన ఓ సంయుక్త మీడియా సమావేశంలో రైతు సంఘాల నేత జగ్మోహన్ సింగ్ హెచ్చరించారు. దీంతో కేంద్రసర్కార్ కాస్త ఇరకాటంలో పడింది. ముగ్గురు కీలక మంత్రులు- అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర తోమర్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో సమావేశమై పరిస్థితిని చర్చించారు. పట్టు వీడని రైతులకు నచ్చచెప్ప డం కష్టమవుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నా యి. ‘పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను ఉపసంహరించడం అసాధ్యం. కేంద్రం కూడా అందుకు సుముఖంగా లేదు. సున్ని తమైన రైతుల సమస్యను ఎలా ఎదుర్కొనాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది’ అని ఆ వర్గాలు వివరించాయి.