బూటకపు కేసులు పెడుతున్నారు.. బీజేపీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్

ABN , First Publish Date - 2020-12-16T05:25:29+05:30 IST

బూటకపు కేసులు పెడుతున్నారు.. బీజేపీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్

బూటకపు కేసులు పెడుతున్నారు.. బీజేపీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలపై అధికార బీజేపీ బూటకపు కేసులు పెడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ ఆరోపించారు. పెటుబడిదారులకు బీజేపీ ‘‘కొమ్ముకాస్తోందంటూ’’ ఆయన పేర్కొన్నారు. ‘‘బీజేపీ విధానాలను వ్యతిరేకించిన వారందరిపైనా ఆపార్టీ వేధింపులకు పాల్పడుతోంది. నిరసన తెలిపిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారు. బీజేపీ నేతలు పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ.. సామాన్యుడి దగ్గర్నుంచి ప్రాథమిక హక్కులను కొల్లగొడుతున్నారు. ప్రస్తుత బీజేపీ హయాంలో ఒక్కరూ కూడా సంతోషంగా లేరు..’’ అని లల్లూ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-16T05:25:29+05:30 IST