బీజేపీలో మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
ABN , First Publish Date - 2020-12-31T01:25:07+05:30 IST
భారత్ క్రికెట్ జట్టు మాజీ లెగ్-స్పిన్నర్, క్రికెట్ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ..

చెన్నై: భారత్ క్రికెట్ జట్టు మాజీ లెగ్-స్పిన్నర్, క్రికెట్ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇన్చార్జి సీటీ రవి సమక్షంలో బుధవారంనాడు ఆయన పార్టీలో చేరారు. తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలోకి చేరికలు చోటుచేసుకుంటున్నాయి.
శివరామ కృష్ణన్ రాజకీయ ప్రవేశం అనూహ్యంగా చోటుచేసుకుంది. శివగా అంతా పిలుచుకునే శివరామృష్ణన్ తొలిసారి ఢిల్లీతో జరిగిన రంజీ ట్రోఫీతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-83లో పాకిస్థాన్లో జరిగిన మ్యాచ్తో ఆయన భారత జట్టులోకి వచ్చారు. 17వ ఏటనే వెస్ట్ ఇండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆయన ఆడారు. క్రికెట్ నుంచి రిటైరైన తరువాత కామెంటేటర్గా మారారు. ఐసీసీ క్రికెట్ కమిటీ ప్లేయర్స్ రిప్రజెంటేటివ్గా కూడా ఉన్నారు.