జేఈఈ ఫలితాలు సోమవారం విడుదల..
ABN , First Publish Date - 2020-10-05T02:04:17+05:30 IST
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు (2020) సోమవారంనాడు ఉదయ 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను..
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు (2020) సోమవారం ఉదయ 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధికార వెబ్సైట్ jeeadv.ac.inలో ఉంచుతారు. స్కోర్ కార్డులతో పాటు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ (ఏఐఆర్)ను కూడా విడుదల చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవల కోవిడ్ ప్రోటాకాల్ మధ్య కట్టుదిట్టంగా ఈ పరీక్షలను నిర్వహించారు.