భూకంప తాకిడికి పరుగులు తీసిన కరోనా బాధితులు

ABN , First Publish Date - 2020-03-23T17:19:48+05:30 IST

క్రొయేషియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశరాజధాని జగ్రెబ్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో తాజాగా సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను మరింతగా...

భూకంప తాకిడికి పరుగులు తీసిన కరోనా బాధితులు

జగ్రెబ్: క్రొయేషియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశరాజధాని జగ్రెబ్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో తాజాగా సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను మరింతగా వణికించింది. 5.3 పాయింట్ల తీవ్రతతో కూడిన ఈ భూకంపం జగ్రెబీకి పది కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడగా, మరో 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు జగ్రెబ్‌లో బంద్ కొనసాగిస్తున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. కాగా క్రొయేషియాలో 235 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకంపం కారణంగా వీరంతా ఆసుపత్రుల నుంచి బయటకు పరుగులు తీశారు. 




Updated Date - 2020-03-23T17:19:48+05:30 IST