గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ల‌లో భూకంపం

ABN , First Publish Date - 2020-07-16T14:49:36+05:30 IST

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల‌లో ఈరోజు ఉద‌యం భూ ప్రకంపనలు సంభవించాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉదయం 7.40 గంటలకు...

గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ల‌లో భూకంపం

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల‌లో ఈరోజు ఉద‌యం భూ ప్రకంపనలు సంభవించాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉదయం 7.40 గంటలకు 4.5 తీవ్రతతో భూమి కంపించింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో ఉద‌యం 4:47 గంటలకు 2.3 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ సమాచారాన్ని తెలియ‌జేసింది. కాగా ఇటీవ‌లి కాలంలో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. జమ్ము కశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, అసోం, మిజోరాంలలో ఇటీవ‌ల ప‌లుమార్లు భూమి కంపించింది. 

Updated Date - 2020-07-16T14:49:36+05:30 IST