రూ.1,000 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

ABN , First Publish Date - 2020-08-11T07:15:31+05:30 IST

నవీ ముంబైలోని నావా షేవా పోర్టులో రూ.1000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌, రెవెన్యూ నిఘా డైరెక్టరేట్‌(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు...

రూ.1,000 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

  • ముంబైలో 191 కిలోల హెరాయిన్‌ స్వాధీనం
  • మార్కెట్‌ విలువ 1000 కోట్లు
  • అఫ్ఘానిస్థాన్‌ నుంచి రవాణా, నలుగురి అరెస్టు


ముంబై, ఆగస్టు 10: నవీ ముంబైలోని నావా షేవా పోర్టులో రూ.1000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌, రెవెన్యూ నిఘా డైరెక్టరేట్‌(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌కు వీటిని తరలించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను పైపుల్లో పెట్టి వాటికి వెదురు కర్రల్లా రంగులు వేసి ఆయుర్వేద మందులుగా నమ్మించేందుకు నిందితులు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను, ఇద్దరు కస్టమ్స్‌ అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-08-11T07:15:31+05:30 IST