కరోనాపై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్

ABN , First Publish Date - 2020-03-14T04:16:04+05:30 IST

వాషింగ్టన్: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు.

కరోనాపై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని ట్విటర్ ద్వారా వెల్లడించిన ట్రంప్ ... కరోనా కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి వివరించే అవకాశం ఉంది. సరిహద్దు విధానం బలంగా ఉండటం వల్లే మరణాల సంఖ్య తగ్గిందని ట్రంప్ ట్వీట్ ద్వారా తెలిపారు. సరిహద్దు విధానం బలహీనంగా ఉండి ఉంటే మరణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేదని చెప్పారు. అమెరికాలో ఇప్పటికే 34 రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. అనేక మంది ఈ లక్షణాలతో ప్రత్యేక కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అమెరికాలోని అనేక అగ్రశ్రేణి సంస్థలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచించాయి. ఇవాళ్టి సమావేశంలో ట్రంప్ హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. 


Updated Date - 2020-03-14T04:16:04+05:30 IST