వైద్యులకు ఘన స్వాగతం పలికిన స్టార్ హోటల్
ABN , First Publish Date - 2020-04-07T23:50:13+05:30 IST
వైద్య సిబ్బందికి తాత్కాలికంగా హోటళ్లలో బస ఏర్పాటు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇవాళ రూమ్స్ కోసం వచ్చిన ఢిల్లీ ప్రభుత్వ వైద్యులకు స్టార్ హోటళ్లు ఘనంగా స్వాగతం పలికాయి. ‘‘డాక్టర్లు లలిత్ హోటల్లోకి అడుగుపెట్టగానే అందరూ చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. హోటల్ సిబ్బంది అంతా ఇవాళ శానిటైజేషన్ వర్క్షాప్ నిర్వహించారు..’’ అని లలిత్ హోటల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎన్ఎల్జేపీ, జీపీ పంత్ ఆస్పత్రులకు చెందిన వైద్యులకు బారఖాంబ రోడ్డులోని లలిత్ హోటల్లో బస ఏర్పాటు చేయగా... రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులకు ఈస్ట్ ఢిల్లీలోని లీలా ఆంబియన్స్ హోటల్లో వసతి కల్పిస్తున్నారు. మరోవైపు తాజ్ హోటల్స్ ఇప్పటికే వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఉచితంగా ఆహార సదుపాయం కల్పిస్తోంది.