డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్న పోస్టర్లు
ABN , First Publish Date - 2020-09-03T13:35:16+05:30 IST
డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

- నాయకత్వం వహించేందుకు రండి
- కోవైలో అళగిరి పోస్టర్ల కలకలం
చెన్నై : ‘నాయకత్వం వహించేందుకు రండి’ అన్న నినాదంతో ఎంకే అళగిరి చిత్రంతో ముద్రించిన పోస్టర్లు కోయం బత్తూర్లో డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోవైలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇంకా ఆ పోస్టర్లో ‘సమయం వచ్చింది, నిజమైన కార్యకర్తల అభీష్టం నెరవేర్చే వీరుడా, పార్టీ నాయకత్వం, కలైంజర్ పాలన అందించేందుకు రా’ అనే సందేశం కూడా ఉంది.. దక్షిణాది జిల్లాల్లో అళగిరి మద్దతుదారులున్న తరుణంలో పశ్చిమ జిల్లా కోయంబత్తూర్లో కూడా అళగిరి మద్దతుదారులు గళం విప్పడం డీఎంకేను గందర గోళానికి గురిచేస్తోంది.