కరోనా నేపథ్యంలో కార్గిల్లో ఆంక్షలు...
ABN , First Publish Date - 2020-03-23T15:25:00+05:30 IST
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో జిల్లా మెజిస్ట్రేట్ సోమవారం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు....
![కరోనా నేపథ్యంలో కార్గిల్లో ఆంక్షలు...](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032309510273/03232020095445n68.gif)
- జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు
కార్గిల్ (జమ్మూకశ్మీర్): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో జిల్లా మెజిస్ట్రేట్ సోమవారం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్గిల్ జిల్లాలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా అంటువ్యాధుల చట్టం 1897, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 ల ప్రకారం 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు కార్గిల్ జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.