ధారావిలో 1,899కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-06-07T00:21:19+05:30 IST
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో మరో 10 మందికి కరోనా..
ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో మరో 10 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,899కి చేరిందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. కాగా ధారావి ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 71 మంది మృతి చెందినట్టు బీఎంసీ వెల్లడించింది.