భర్త ఇంట్లో ఉండగానే.. అత్తామామలను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2020-04-25T17:24:14+05:30 IST

తన భర్త కళ్ల ముందే అతని తల్లిదండ్రులను భార్య హత్య చేసిన దారుణ ఉదాంతం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఛావ్లా ప్రాంతంలో ఉంటున్న సతీశ్

భర్త ఇంట్లో ఉండగానే.. అత్తామామలను హత్య చేసిన భార్య

న్యూఢిల్లీ: తన భర్త కళ్ల ముందే అతని తల్లిదండ్రులను భార్య హత్య చేసిన దారుణ ఉదాంతం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఛావ్లా ప్రాంతంలో ఉంటున్న సతీశ్ సింగ్(37), భార్య కవిత(35).. ఆమె అత్తామామలు రాజా సింగ్(61), ఓంవతి(58)లను గొంతునులిమి.. ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో వాళ్ల పిల్లలకు కూడా ఇంట్లోనే ఉన్నారని వాళ్లు పేర్కొన్నారు.


ఇద్దరి మృతదేహాలు బెడ్‌రూంలో దొరికాయని.. వాళ్ల ముఖాలపై కత్తిగాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కవిత, సతీశ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-04-25T17:24:14+05:30 IST