అవార్డులను వాపస్ చేస్తామంటూ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్... అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-12-07T21:54:32+05:30 IST

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారు రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్

అవార్డులను వాపస్ చేస్తామంటూ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్... అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారు రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు. క్రీడా రంగంలో తమ ప్రతిభను గుర్తించి కేంద్రం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తామంటూ వారు రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పంజాబ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది క్రీడాకారులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. క్రీడాకారుడు కర్తార్ సింగ్ మాట్లాడుతూ... ‘‘మాకు ప్రదానం చేసిన అవార్డులను వాపస్ చేయాలని రాష్ట్రపతి భవన్‌ వైపు బయల్దేరాం. దాదాపు 30 మంది బయల్దేరాం. పంజాబ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల క్రీడాకారులు కూడా ఇలాగే వాపస్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు.’’ అని కర్తార్ సింగ్ వెల్లడించారు. 

Updated Date - 2020-12-07T21:54:32+05:30 IST