కరోనాతో ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ మృతి
ABN , First Publish Date - 2020-07-01T13:59:08+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో కరోనా బారినపడిన ఒక ఇన్స్పెక్టర్ మృతిచెందారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. సంజీవ్ యాదవ్...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా బారినపడిన ఒక ఇన్స్పెక్టర్ మృతిచెందారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. సంజీవ్ యాదవ్ గత 14 రోజులుగా సాకేత్లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాక్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్కు రెండుసార్లు ప్లాస్మా ఇచ్చారు. ఇందుకోసం అక్కడి వైద్యులు ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నారు. అయినప్పటికీ వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు. సంజీవ్ ఈ ఏడాది జనవరిలో పోలీసు పతకాన్ని అందుకున్నారు. కాగా ఢిల్లీలో కొత్తగా 2,199 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మరణించారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 87,360కు పెరిగాయి. 2,742 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గత 24 గంటల్లో 2,113 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.