దేశ రాజధానిలో కరోనా భీభత్సం.. 40వేలు దాటిన కేసులు

ABN , First Publish Date - 2020-06-15T03:07:46+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భీభత్సం సృష్టిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా 2వేలకు పైగా కేసులు ఢిల్లీలో...

దేశ రాజధానిలో కరోనా భీభత్సం.. 40వేలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భీభత్సం సృష్టిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా 2వేలకు పైగా కేసులు ఢిల్లీలో నమోదయ్యయి. దీంతో రాష్టంలో మొత్తం కేసులు 40,000 దాటేశాయి. దీనికి సంబంధించి  రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,224 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 878 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 41,182కి చేరింది. వీరిలో 24,032 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 15,823 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రంలో 1,327 మరణాలు రాష్ట్రంలో సంభవించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-15T03:07:46+05:30 IST