దేశరాజధానిలోని తెలుగు కూలీలకు నిత్యవసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-05T15:55:26+05:30 IST

లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రాజధానిలో నివాసం ఉంటున్న తెలుగు కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దేశరాజధానిలోని తెలుగు కూలీలకు నిత్యవసరాల పంపిణీ

ఢిల్లీ: లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రాజధానిలో నివాసం ఉంటున్న తెలుగు కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఎన్ఆర్ఐ మిస్ దివ్య రావెళ్ళ, ప్రముఖ సామాజిక కార్యకర్త, వైద్యుడు డాక్టర్ ఆనంద్ తమ వంతు బాధ్యతగా నిత్యవసరాలు అందించారు. నగరంలోని సుల్తాన్ పురి బస్తీ వాసులకు గోధుమ పిండి, వంట నూనె, పప్పు మొదలగు వంట సామాగ్రిని వంద కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. తన మిత్రురాలు దివ్య రావెళ్ళ అందించిన ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-04-05T15:55:26+05:30 IST