ఫెస్టివల్ సీజన్ కోసం 3,467 అంతర్రాష్ట్రీయ బస్సు సర్వీసులు ప్రారంభం!

ABN , First Publish Date - 2020-11-03T13:00:09+05:30 IST

ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో అంతర్రాష్ట్రీయ బస్సు సర్వీసులు ప్రారంభం కానుండటంతో...

ఫెస్టివల్ సీజన్ కోసం 3,467 అంతర్రాష్ట్రీయ బస్సు సర్వీసులు ప్రారంభం!

న్యూఢిల్లీ: ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో అంతర్రాష్ట్రీయ బస్సు సర్వీసులు ప్రారంభం కానుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల తరువాత నేటి నుంచి దేశరాజధాని ఢిల్లీలో అంతర్రాష్ట్రీయ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 



దీంతో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలలోని వివిధ పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సౌకర్యం సులభతరం కానుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో బస్సులు నడుస్తుండటంతో బస్సులోని సిబ్బందితో పాటు ప్రయాణికులు కరోనా ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య ప్రతీరోజూ అత్యధికంగా 1,519 బస్సులు నడవనున్నాయి. 

Updated Date - 2020-11-03T13:00:09+05:30 IST