ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో గందరగోళం

ABN , First Publish Date - 2020-04-22T00:22:04+05:30 IST

ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో ఈ రోజు గందరగోళం నెలకొంది. అత్యవసర సేవలు అందించే వారితోపాటు

ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో గందరగోళం

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులో ఈ రోజు గందరగోళం నెలకొంది. అత్యవసర సేవలు అందించే వారితోపాటు వందలాదిమంది సరిహద్దులో చిక్కుకుపోయారు. కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగా సరిహద్దులు మూసేయాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విపత్తు నిర్వహణ చట్టం కింద ఘజియాబాద్-ఢిల్లీ మధ్య రవాణాను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు సరిహద్దులను మూసివేశారు. దీంతో వందలాదిమంది సరిహద్దుకు ఇరువైపులా చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిలో వైద్యులు, రవాణా సిబ్బంది, బ్యాంకర్లు ఉన్నారు. వారిని అనుమతించేందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఇరువైపుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ డ్యూటీ పాస్‌లను చూపించినా పోలీసులు అనుమతించడం లేదని ఓ వైద్యుడు వాపోయాడు.   

Updated Date - 2020-04-22T00:22:04+05:30 IST