ఢిల్లీలో రెండవ రోజూ 100 దాటిన కరోనా మృతులు... కొత్తగా 6,608 కేసులు

ABN , First Publish Date - 2020-11-21T12:16:32+05:30 IST

దేశరాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా...

ఢిల్లీలో రెండవ రోజూ 100 దాటిన కరోనా మృతులు... కొత్తగా 6,608 కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,608 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 188 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఢిల్లీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8,159కి చేరుకుంది. ఢిల్లీలలో ప్రస్తుతం 40,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడినవారితో పోలిస్తే, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉంది. 


గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,775 మంది కోలుకున్నారు. ఇది కొత్త రికార్డుగా నిలిచింది. దీనికి ముందు జూన్ 20న ఒక్కరోజులో కరోనా నుంచి అత్యధికంగా 7,725 మంది కోలుకున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం కొత్తగా 62.425 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, వారిలో 6,608 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇప్పటివరకూ ఢిల్లీలో 5,17,238 మందికి కరోనా సోకింది. వీరిలో 4,68,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 40,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-11-21T12:16:32+05:30 IST