దావూద్ కరాచీలో ఉన్నాడు.. ఒప్పుకున్న పాకిస్తాన్!
ABN , First Publish Date - 2020-08-23T03:07:53+05:30 IST
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది.
ఇస్లామాబాద్: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. 88మంది ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఈ విషయాన్ని పాక్ వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు తెలిపింది. పాక్ ఆర్థిక ఆంక్షలు విధించిన జాబితాలో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తదితరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తోందనే కారణంగా పాక్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు పాక్కు హెచ్చరికలు కూడా అందాయి. ఈ పరిణామాలను తప్పించుకునేందుకే 88మంది ఉగ్రవాదులు, సంస్థలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు పాక్ ప్రకటించింది.