లాక్డౌన్ పట్టించుకోకపోవడంతో పంజాబ్లో కర్ఫ్యూ
ABN , First Publish Date - 2020-03-23T20:12:37+05:30 IST
కరోన వైరస్ను అరికట్టేందుకు పంజాబ్ రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించినా... ప్రజలు రోడ్లపైకి

పంజాబ్: కరోన వైరస్ను అరికట్టేందుకు పంజాబ్ రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించినా... ప్రజలు రోడ్లపైకి వస్తుండటంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సీరియస్ అయ్యారు. ప్రజల రక్షణార్థమే లాక్డౌన్ ప్రకటించామని మొత్తుకున్నా సరే, ప్రజలు వినకపోవడంతో చివరికి రాష్ట్రమంతటా కర్ఫ్యూను ప్రకటించారు. సోమవారం నుంచి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీతో అమరీందర్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు లాక్డౌన్ను పట్టించుకోకపోవడంతో రాష్ట్రమంతటా కర్ఫ్యూను ప్రకటిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మధ్యలో వెసులుబాటు ఉండదని, కఠినంగా కర్ఫ్యూను అమలు చేయాలని అమరీందర్ ఆదేశించారు.