ఆస్పత్రి నుంచి పారిపోయిన కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తి

ABN , First Publish Date - 2020-04-28T22:28:39+05:30 IST

తమళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

ఆస్పత్రి నుంచి పారిపోయిన కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తి

చెన్నై: తమళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన 58 సంవత్సరాల వ్యక్తి పారిపోయారు. పులియంటోప్‌లోని తన ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తిని ప్లవర్ బజార్ పోలీసులు గుర్తించారు. కరోనా బాధితుడిని తిరిగి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-04-28T22:28:39+05:30 IST