రాజస్థాన్లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు
ABN , First Publish Date - 2020-09-21T01:50:53+05:30 IST
రాజస్థాన్లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కొత్తగా రాష్ట్రంలో 1,865 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ 14 మంది మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనాతో మొత్తం 1,336 మంది మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 1,14,989 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 95,469 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 18,184 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.