స్వాబ్ టెస్టుతో పోలిస్తే లాలాజల పరీక్ష మరింత చవక: శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-08-22T21:46:11+05:30 IST

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు చేసే స్వాబ్ పరీక్షతో పోలిస్తే లాలాజల పరీక్ష చవకే కాకుండా వేగంగా కూడా ఫలితం

స్వాబ్ టెస్టుతో పోలిస్తే లాలాజల పరీక్ష మరింత చవక: శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను గుర్తించేందుకు చేసే స్వాబ్ పరీక్షతో పోలిస్తే లాలాజల పరీక్ష చవకే కాకుండా వేగంగా కూడా ఫలితం తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్‌లో ఈ ప్రత్యామ్నాయ పరీక్ష ఇంకా అందుబాటులోకి రానప్పటికీ, ఇందులో మరింత వేగంగా, పూర్తి కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాక నమూనాల సేకరణ సమయంలో ఆరోగ్య కార్యకర్తల రిస్క్‌ను కూడా ఇది తగ్గిస్తుందన్నారు. లాలాజల ఆధారిత కొవిడ్ పరీక్ష ప్రామాణిక నాసోఫారింజియల్ స్వాబ్ పద్ధతుల కంటే మెరుగైనది. ఎందుకంటే ప్రజలకు ఎవరికి వారే తమ సొంత లాలాజలాన్ని సేకరించగలుగుతారు. పరిశుభ్రమైన ఓ స్టెరిల్ ట్యూబ్‌లోకి లాలాజలాన్ని ఉమ్మి తర్వాత దానిని ప్రాసెసింగ్ కోసం ప్రయోగశాలకు పంపే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-22T21:46:11+05:30 IST