మా కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోండి...

ABN , First Publish Date - 2020-04-07T11:55:43+05:30 IST

దేశ రాజధాని నగరంలో ఉన్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు....

మా కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోండి...

ఢిల్లీ సీఎంకు కేరళ సీఎం లేఖ 

తిరువనంతపురం (కేరళ): దేశ రాజధాని నగరంలో ఉన్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు. ఈ మేర కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎంకు లేఖ రాశారు. ఢిల్లీలో పనిచేస్తున్న మా కేరళ నర్సులను ఆదుకోవాలని సీఎం పినరయి విజయన్ కోరారు. అలాగే మహారాష్ట్రలోనూ పనిచేస్తున్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పలు ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో కేరళ నర్సులు కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యుత్తమ నర్సింగ్ సేవలు అందిస్తున్న కేరళ నర్సుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం వివిధ రాష్ట్రాల సీఎంలను అభ్యర్థించారు. 

Updated Date - 2020-04-07T11:55:43+05:30 IST