మార్చి 31వరకు ఉబర్, ఓలా సర్వీసుల బంద్
ABN , First Publish Date - 2020-03-23T16:50:06+05:30 IST
కార్ల షేరింగ్ కంపెనీలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ నగరంలో ఈ నెల 31వతేదీ వరకు బంద్ చేయాలని ఓలా, ఉబర్ సర్వీసులు నిర్ణయించాయి.....
న్యూఢిల్లీ : కార్ల షేరింగ్ కంపెనీలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ నగరంలో ఈ నెల 31వతేదీ వరకు బంద్ చేయాలని ఓలా, ఉబర్ సర్వీసులు నిర్ణయించాయి. ఢిల్లీ నగరాన్ని ఈ నెల 31వతేదీ వరకు లాక్డౌన్ చేయడంతో ప్రభుత్వ ఆదేశానుసారం ఓలా, ఉబర్ కార్ల షేరింగ్ సర్వీసుల అధికార ప్రతినిధులు ప్రకటించారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రైవేటు బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాల రాకపోకలను నిలిపివేసింది. అత్యవసర సర్వీసులకు చెందిన కొన్ని వాహనాలను మాత్రమే నడుపుకునేందుకు కేంద్రం అనుమతించిందని ఓలా అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ మార్చి 31వతేదీ వరకు ఓలా, ఉబర్ క్యాబ్ లను బంద్ చేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి.