కరోనాను జార్జ్ బుష్ ముందే ఊహించారా!
ABN , First Publish Date - 2020-04-10T08:50:29+05:30 IST
రోనా వైరస్ గురించి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారని, ఓ బాలుడు ముందే హెచ్చరించాడని....
- మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి
- 2005లో అప్పటి అమెరికా అధ్యక్షుడి వీడియో వైరల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారని, ఓ బాలుడు ముందే హెచ్చరించాడని.. ఇలా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ పదిహేనేళ్ల క్రితమే కరోనా లాంటి మహమ్మారి గురించి హెచ్చరించారు. ఓ మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2005లో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అంటువ్యాధి(మహమ్మారి) కార్చిచ్చు లాంటిది. ఎంత త్వరగా నియంత్రిస్తే అంత తక్కువ నష్టం. లేకపోతే నష్టం ఊహకు కూడా అందదు’’ అని అన్నారు. అప్పుడు ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారిని బుష్ అప్పుడే ఊహించి ఉంటారని చర్చ జరుగుతోంది.