జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-17T23:41:56+05:30 IST
జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు

శ్రీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొత్తగా 108 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,121 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వల్ల 70 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు.