అస్థికలశాలతో చైనా అబద్ధాల గుట్టు రట్టు?
ABN , First Publish Date - 2020-04-01T08:48:08+05:30 IST
కరోనా వైర్సకు జన్మస్థానమైన వూహాన్లో 67 వేల మంది దాని బారిన పడితే.. వారిలో 2,535 మంది చనిపోయారని, తమ దేశంలో మృతుల సంఖ్య 3,305 మందేనని ప్రకటిస్తోంది. కానీ..

బీజింగ్, మార్చి 31: కరోనా వైర్సకు జన్మస్థానమైన వూహాన్లో 67 వేల మంది దాని బారిన పడితే.. వారిలో 2,535 మంది చనిపోయారని, తమ దేశంలో మృతుల సంఖ్య 3,305 మందేనని ప్రకటిస్తోంది. కానీ.. వూహాన్లో తమవారి అస్థికలశాల కోసం వస్తున్న వేలాది మందిని చూస్తుంటే మృతుల సంఖ్య 45 వేల నుంచి 1.2 లక్షల మంది దాకా చనిపోయి ఉంటారన్నది అంచనా. దీంతో చైనా అబద్ధాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.