తిండి లేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-03-30T13:29:31+05:30 IST

తిండి లేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

తిండి లేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చండీగఢ్‌ పోలీసులకు ఒక మహిళ ఫోన్‌ చేసింది. తమకు ఇంట్లో తినడానికి తిండి లేదని.. అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ముందులు కూడా లేవని.. తమ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని తెలిపింది. దీంతో పోలీసులు శరవేగంగా స్పందించి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం బిడ్డ వైద్యానికి ఆర్థిక సహాయం, అవసమైన ఆహారాన్ని అందించి ఆదుకున్నారు.

Updated Date - 2020-03-30T13:29:31+05:30 IST