ఇకపై రోజుకు 20 వేల టెస్టులు: యోగి
ABN , First Publish Date - 2020-05-31T19:35:15+05:30 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇకపై రోజుకు 20 వేల టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇకపై రోజుకు 20 వేల టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఇఫ్పటివరకూ రోజుకు పది వేల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యూపీకి చెందిన వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చారు. దీంతో టెస్టులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి నాలుగున ఘజియాబాద్లో తొలి కరోనా కేసు నమోదైన సమయంలో యూపీలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. అయితే ఇప్పుడు 30 ల్యాబులు ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ కోసమే ప్రత్యేకంగా 50 ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 80 వేల పరుపులు సిద్ధం చేశారు. ఇప్పటివరకూ 2,36,00 టెస్టులు చేశారు. 73 లక్షల నివాసాల్లో 3.69 కోట్ల మందిపై ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. యూపీలో ప్రస్తుతం 1063 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
యూపీలో ఇప్పటివరకూ 7,700 మందికి కరోనా సోకింది. 4651 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 213 మంది చనిపోయారు.