ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-06-04T16:07:21+05:30 IST
ఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23645 కి చేరుకుంది.
![ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020060410263377/06042020103704n89.jpg)
ఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23645 కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 13497 కాగా.. కోలుకుంటున్న వారి సంఖ్య 9542కి చేరింది. మృతుల సంఖ్య 606కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1513 కేసులు నమోదయ్యాయి.
కాగా.. దేశంలో ఇప్పటి వరకు 42,42,718 కరోనా టెస్టులను నిర్వహించినట్టు ప్రకటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.గడిచిన 24 గంటల్లో 1,39,485 కరోనా టెస్టులు నిర్వహించనట్టు ఐసీఎమ్ఆర్ తెలిపింది.