కరోనా బాధితులకు ముంచుకొస్తున్న మరో ముప్పు

ABN , First Publish Date - 2020-09-06T21:35:58+05:30 IST

కరోనా బారినపడి అల్లాడిపోతున్న ప్రజలకు ఇది మరో షాకింగ్ వార్తే. కొవిడ్ రోగులకు మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు

కరోనా బాధితులకు ముంచుకొస్తున్న మరో ముప్పు

న్యూఢిల్లీ: కరోనా బారినపడి అల్లాడిపోతున్న ప్రజలకు ఇది మరో షాకింగ్ వార్తే. కొవిడ్ రోగులకు మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు ఢిల్లీ వైద్యుల పరిశోధనలో తేలింది. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కనిపించడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది కరోనా రోగులకు డెంగ్యూతోపాటు మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయింది.


తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. దీంతో డెంగ్యూ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. మరో యువకుడికి కరోనాతోపాటు మలేరియా కూడా సోకినట్టు గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాధులు ఒకేసారి సోకడంతో చికిత్స విషయంలో ఏ వ్యాధికి చికిత్స అందించాలో తెలియక వైద్యులు అయోమయంలో పడ్డారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య తెలిపారు. 


చాలామందిలో కరోనాతో పాటు డెంగ్యూ, మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయినట్టు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. కొందరిలో డెంగ్యూతోపాటు మలేరియాను కూడా గుర్తించినట్టు చెప్పారు. అయితే కరోనా వచ్చిన అందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-06T21:35:58+05:30 IST