జేడీయూ ఎంపీ, ఎంఎల్ఏ లలన్, పట్నా డీఎంలకు కరోనా!
ABN , First Publish Date - 2020-08-02T17:14:42+05:30 IST
బీహార్లోని పట్నా జిల్లా మేజిస్ట్రేట్, జేడీయూ రాజ్యసభ సభ్యుడు ఆర్సీపీ సింగ్, జేడీయూ ఎమ్మెల్యే లలన్ పాస్వాన్లు కరోనా బారిన పడ్డారు. బీహార్లో ప్రతిరోజూ 2000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
పట్నా: బీహార్లోని పట్నా జిల్లా మేజిస్ట్రేట్, జేడీయూ రాజ్యసభ సభ్యుడు ఆర్సీపీ సింగ్, జేడీయూ ఎమ్మెల్యే లలన్ పాస్వాన్లు కరోనా బారిన పడ్డారు. బీహార్లో ప్రతిరోజూ 2000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాజధాని పాట్నా కరోనా హాట్స్పాట్గా మారింది. శనివారం ఒక్కరోజు బీహార్లో మొత్తం 3,521 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 54,508కు చేరుకుంది. ఇదిలా ఉండగా, రాజ్యసభ సభ్యుడు, జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్సీసీ సింగ్, జెడీయూ ఎమ్మెల్యే లలన్ పాస్వాన్, పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ కుమార్ రవిలకు కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఎంపీ ఆర్సీపీ సింగ్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఎయిమ్స్ వైద్యాధికారి డాక్టర్ సిఎం సింగ్ తెలిపారు. డిఎం కుమార్ రవి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ లలన్ పాస్వాన్ కూడా హోంక్వారంటైన్లో ఉన్నారు.