రాజస్థాన్లో నవజాత శిశువుకు కరోనా
ABN , First Publish Date - 2020-04-21T09:50:47+05:30 IST
రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో ఓ నవజాత శిశువుకు కరోనా సోకింది. శనివారం జన్మించిన ఆ శిశువుకు తన తల్లిదండ్రుల

జైపూర్, ఏప్రిల్ 20: రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో ఓ నవజాత శిశువుకు కరోనా సోకింది. శనివారం జన్మించిన ఆ శిశువుకు తన తల్లిదండ్రుల నుంచే వైరస్ సోకడం గమనార్హం. ఆ కుటుంబంలో శిశువు తల్లిదండ్రులే కాకుండా ఇతర సభ్యులూ ఇప్పటికే కొవిడ్ బారినపడ్డారు. శిశువు శనివారం జన్మించగా, ఆదివారం కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగూర్ జిల్లాలో ఇప్పటి వరకు 59 మంది కరోనా సోకింది.