ముంబైలో 10 లక్షల మైలు రాయిని దాటేసిన కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-12T20:57:31+05:30 IST
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 24,886 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 24,886 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 10 లక్షల మైలు రాయిని దాటేసింది. ఈ నెల 6న రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలకు చేరుకోగా, ఐదు రోజుల వ్యవధిలోనే మరో లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
అలాగే, కొత్తగా 393 మంది కరోనాకు బలయ్యారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28,724కు పెరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,15,681 చేరుకోగా, 7,15,023 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2,71,566 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.