సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి
ABN , First Publish Date - 2020-06-25T06:50:47+05:30 IST
దేశంలో 1,500పైగా సహకార బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేసిన మదుపర్లకు భరోసా కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్ను బుధవారమిక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన...

- ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణ
- 8.6 కోట్ల డిపాజిటర్లకు భరోసా
- అంతరిక్ష మిషన్లలో ప్రైవేటు భాగస్వామ్యం
- 15 వేల కోట్లతో పశు సంవర్ధక నిధి
- ఓబీసీ కమిషన్ గడువు పొడిగింపు
- కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
న్యూఢిల్లీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో 1,500పైగా సహకార బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేసిన మదుపర్లకు భరోసా కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్ను బుధవారమిక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 1,482 పట్టణ సహకార బ్యాంకులు, 58 అంతర్రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులు సహా ప్రభుత్వ బ్యాంకులన్నీ ఇక ఆర్బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్ జావడేకర్ విలేకరులకు వెల్లడించారు. ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదించగానే ఇది అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల ఈ బ్యాంకుల్లోని రూ.4.84 లక్షల కోట్ల సొమ్ము కు భద్రత ఏర్పడుతుందని.. 8.6 కోట్ల మంది మదుపర్లకు భరోసా ఉంటుందని చెప్పారు. గత ఏడాది ముంబైలోని పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంకు(పీఎంసీ)లో కుంభకోణం జరిగిన నేపథ్యంలో సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తేవాలని కేంద్రం నిశ్చయించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. కేబినెట్ నిర్ణయంతో ఇక నుంచి దేశంలోని అన్ని సహకార బ్యాంకులు.. షెడ్యూల్ బ్యాంకుల్లా పూర్తిగా ఆర్బీఐ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. కాగా.. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)లోని ‘శిశు’ విభాగం కింద రుణాలు (రూ.50 వేలకు తక్కువగా) తీసుకునేవారికి 2ు వడ్డీ రాయితీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు బకాయి ఉన్న అని శిశు రుణాలకు రాయితీ వర్తిస్తుందని జావడేకర్ చెప్పారు. ఇంకోవైపు.. రూ.15 వేల కోట్లతో పశు సంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఏహెచ్ఐడీఎఫ్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిప్రకారం.. డెయిరీ, మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్, పశు ఆహారోత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టే ప్రైవేటు సంస్థలు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్సఎంఈ)కు 3శాతం వడ్డీ రాయితీ కల్పిస్తారు. ఈ నిర్ణయం వల్ల దేశంలో పాల ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతాయని.. అదనంగా 35 లక్షల ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జావడేకర్ వెల్లడించారు. కరోనాతో దెబ్బతిన్న పరిశ్రమలను, రైతులను, సామాన్యులను ఆదుకునేందుకు ప్రకటించిన రూ.20 లక్షల ప్యాకేజీలో ఇది భాగం. అలాగే ఎంఎ్సఎంఈల నిబంధనలకు లోబడి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు రుణ హామీ ఇచ్చేందుకు రూ.750 కోట్లతో ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేయనుంది. నాబార్డు దీనిని పర్యవేక్షిస్తుంది. కాగా.. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు కూడా పాలుపంచుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్-ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పే్స)ను ఏర్పాటు చేశారు. అంతరిక్ష కార్యకలాపాలతో పాటు గ్రహాన్వేషణ మిషన్లలోనూ ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావచ్చు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడాన్ని ఇస్రో చైర్మన్ కె.శివన్ స్వాగతించారు.
ఓబీసీ కమిషన్ గడువు మరో 6 నెలలు పెంపు..
ఓబీసీ వర్గీకరణపై అధ్యయనానికి నియమించిన కమిషన్ గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని 340 అధికరణ ప్రకారం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ కాలపరిమితి జూలై 31న ముగుస్తుంది.