మేడమ్... ఎన్సీపీ మనల్ని చెదల్లా మింగేస్తోంది : సోనియాకు కాంగ్రెస్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-30T19:07:04+05:30 IST

మహారాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధినేత్రి సోనియా గాంధీకి సంచలన లేఖ రాసింది. మహావికాస్ అగాఢీలోని శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్‌ను ఏమాత్రం

మేడమ్... ఎన్సీపీ మనల్ని చెదల్లా మింగేస్తోంది : సోనియాకు కాంగ్రెస్ ఫిర్యాదు

ముంబై : మహారాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధినేత్రి సోనియా గాంధీకి సంచలన లేఖ రాసింది. మహావికాస్ అగాఢీలోని శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియాకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్సీపీ, శివసేనలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, చెదల్లా పాడుచేస్తున్నారని మండిపడింది. ముంబై కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి విశ్వబంధు రాయ్ ఈ మేరకు సోనియాకు లేఖ రాశారు. ‘‘ఎన్సీపీ, శివసేనలు ఓ వ్యూహం ప్రకారం కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నాయి. వారి వారి పార్టీలను విస్తరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దీనికి అడ్డుకట్ట వేయడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారు.’’  అని విశ్వబంధు ఈ లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పేర్కొన్న  ఏ హామీనీ మహావికాస్ నెరవేర్చడం లేదని, కాంగ్రెస్ నుంచి నేతలు వలసలు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు సంకీర్ణ ధర్మాన్ని పాటించాలని శివసేన, ఎన్సీపీకి సూచించాలని విశ్వబంధు ఈ లేఖ ద్వారా సోనియా గాంధీని కోరారు. 


Updated Date - 2020-12-30T19:07:04+05:30 IST