ఐసీయూలో చేరిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్
ABN , First Publish Date - 2020-11-16T01:02:16+05:30 IST
ఐసీయూలో చేరిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్

చండీగఢ్: అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను గురుగ్రామ్లోని మెదంత ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. అహ్మద్ పటేల్కు కొన్ని వారాల ముందు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. అహ్మద్ పటేల్ వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశారు.