తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. చెన్నై తర్వాత మరో నగరంలో..

ABN , First Publish Date - 2020-06-23T03:04:30+05:30 IST

కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం...

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. చెన్నై తర్వాత మరో నగరంలో..

మధురై: కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మధురై నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు పళని సర్కార్ గుర్తించింది. కరోనా తీవ్రత దృష్ట్యా మధురైలో జూన్ 23 నుంచి జూన్ 30 వరకూ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధురై కార్పొరేషన్ పరిధితో పాటు, మధురై తూర్పులోని రూరల్ ప్రాంతాల్లో, పశ్చిమ మధురైలోని తిరుపరనకుండ్రంలో రేపటి నుంచి జూన్ 30 వరకూ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో, రైల్వే స్టేషన్లకు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. 33 శాతం ఉద్యోగులతో మధురైలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కూడా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-06-23T03:04:30+05:30 IST